ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

    Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Mla Prashanth reddy | రెండుసార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ (Mp Arvind)​ జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, కవిత, హరీష్‌రావుపై అర్వింద్​ చేసిన అనుచిత వ్యాఖలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి అర్వింద్‌కు అర్హత, స్థాయి లేదన్నారు.

    మోదీని చూసి ప్రజలు ఓట్లేస్తున్నారని, ఎంపీ అర్వింద్​ను చూసి వేయట్లేదని ఎద్దేవా చేశారు. 71ఏళ్లు ఉన్న కేసీఆర్​ను ముసలివాడు అంటే 74 ఏళ్లు ఉన్న పీఎం మోదీని ఏమనాలని ప్రశ్నించారు. అర్వింద్​ మాట్లాడిన దిగజారుడు మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ను విమర్శించడానికి ఎంపీ అర్వింద్​కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదని స్పష్టం చేశారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...