ePaper
More
    HomeతెలంగాణKadiyam Srihari | కడియం అనుచరులు కబ్జా చేసిన భూమి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

    Kadiyam Srihari | కడియం అనుచరులు కబ్జా చేసిన భూమి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kadiyam Srihari : కడియం అనుచరులు కబ్జా చేసిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా(Jangaon district) స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి పరిధిలోగల సర్వే నంబరు 46 లో ఉన్న 34 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని కడియం అనుచరులు కబ్జా చేశారు.

    ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య(Former MLA Dr. Rajaiah) ప్రెస్​మీట్​లో అధికారులను హెచ్చరించారు. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. సంబంధిత సర్వే నంబరు 46లో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకొన్నారు. కడియం శ్రీహరి అనుచరులు నాటిన కనీలను తొలగించారు.

    స్థానిక ఆర్ఐRI సతీష్, సర్వేయర్ నరేష్ హద్దులను సరిచూసుకున్నారు. అధికారులు చేరుకున్నాక.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి వచ్చి, నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ, అధికారులు వెనక్కి తగ్గకుండా దగ్గరుండి భూమి స్వాధీనం పనులు పూర్తి చేశారు.

    More like this

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...

    Diabetes | షుగర్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Diabetes | షుగర్ వ్యాధి (Diabetes) పట్ల పలు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని...

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్​మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...