ePaper
More
    Homeఅంతర్జాతీయంLondon | భారతీయుల పీక కోస్తామన్న పాక్​ అధికారి

    London | భారతీయుల పీక కోస్తామన్న పాక్​ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | పాకిస్తాన్ pakistan​ తన తీరు మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని  terrorism పెంచి పోషిస్తున్న ఆ దేశం బహిరంగంగానే వారికి మద్దతు తెలుపుతోంది. ఆ దేశ నాయకులతో పాటు అధికారులు భారతీయులపై విషం చిమ్ముతున్నారు. పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack పాల్పడిన వారు స్వాతంత్య్ర సమరయోధులని పాక్​ ఉప ప్రధాని శుక్రవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లండన్​లోని పాక్​ హైకమిషర్​లోని ఓ అధికారి భారతీయుల పీక కోస్తామంటూ సైగలు చేశాడు.

    పహల్గామ్​ దాడికి వ్యతిరేకంగా లండన్​లో london ఎన్​ఆర్​ఐలు NRI’s నిరసన తెలిపారు. పాకిస్తాన్​ హై కమిషనర్​ అధికారి వారిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పీక కోస్తామంటూ బెదిరింపులకు దిగాడు. అభినందన్​ వర్దమాన్​ చిత్రం చూపిస్తూ సైగలు చేయడం గమనార్హం. దీంతో భారతీయులు పాక్​ హైకమిషన్​ లోనికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సదరు అధికారి తీరును నిరసిస్తూ ఎన్​ఆర్​ఐలు అక్కడే నిరసన తెలిపారు. దీంతో లండన్​ పోలీసులు అక్కడ భద్రతను పెంచారు. కాగా ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

    More like this

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...