ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | అటవీశాఖ సిబ్బందిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

    Forest Department | అటవీశాఖ సిబ్బందిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Forest Department | అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకువ వెళ్లిన ఫారెస్ట్​ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీరేంజ్ (Indalwai Forest Range)​ పరిధిలోని కొట్టాలపల్లి బీట్ కంపార్ట్​మెంట్​ 593లో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు.

    భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్​ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తండావాసి భూక్యా నవీన్, మరికొందరు కలిసి అటవీ అధికారులపై కారం చల్లారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ అధికారులు ప్రవీణ్, రాములు, ఖదీర్, బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్పల్లి పోలీసులు (Dharpally Police station) ట్రాక్టర్​ను సీజ్​ చేసి దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్​ఆర్​వో రవిమోహన్​ భట్​ పేర్కొన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

    పోలీసులు సీజ్​ చేసిన ట్రాక్టర్​

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...