ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | ఐదు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం(State Government) వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. సీఎం రేవంత్​రెడ్డి సోమవారం రైతు భరోసా జమ ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే రోజు రెండు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) జమ చేసింది. అనంతరం మూడు, నాలుగు ఎకరాల్లోపు రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా.. గురువారం ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా జమ చేసింది.

    ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల కోసం రూ.1,189 కోట్లు విడుదల చేసింది. దీంతో అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఈ సీజన్​లో ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ.6,404 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.

    Rythu Bharosa | గత సీజన్​లో మొండిచెయ్యి

    యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా జమ అయింది. నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న వారికి డబ్బులు పడలేవు. దీంతో ఈ సారి కూడా తమకు డబ్బులు వస్తాయో రావో అని రైతులు(Farmers) ఆందోళన చెందారు. తాజాగా ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్​కు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...