ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | చెత్తలో దొరికిన బంగారు గొలుసు.. మున్సిపల్​ సిబ్బంది ఏం చేశారంటే..

    Nizamabad City | చెత్తలో దొరికిన బంగారు గొలుసు.. మున్సిపల్​ సిబ్బంది ఏం చేశారంటే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో చెత్త సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్​ సిబ్బంది నిజాయితీ చాటారు. ఓ మహిళకు చెందిన బంగారు గొలుసును భద్రంగా ఆమె చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జోన్​–2 పరిధిలోని 24వ డివిజన్​లో ఉదయం చెత్త సేకరణలో నిమగ్నమైన ట్రాక్టర్​ డ్రైవర్​ ఇమామ్​, జవాన్​ కుమార్​లకు రెండు తులాల బంగారు గొలుసు దొరికింది.

    అనంతరం కొద్దిసేపటికి గాయత్రినగర్​కు (Gayatri nagar) చెందిన పద్మాగౌడ్​ అనే మహిళ గొలుసు పోయిందని మున్సిపల్​ సిబ్బందిని సంప్రదించింది. దీంతో విచారణ అనంతరం ఆమెకు వారు బంగారు గొలుసును అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇమామ్​, జవాన్​ కుమార్​ను కార్పొరేషన్​ కమిషనర్​ దిలీప్​కుమార్​ ఘనంగా సన్మానించారు. ప్రజలు చెత్తవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ సిబ్బంది నిజాయితీ నిబద్దతతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

    పోగొట్టుకున్న గొలుసును మహిళ పద్మాగౌడ్​కు అందజేస్తున్న మున్సిపల్​ సిబ్బంది

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...