ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | తదుపరి రైల్వే ఆస్తులు, కశ్మీరీ పండితులే ఉగ్రవాదుల లక్ష్యం​!

    Jammu Kashmir | తదుపరి రైల్వే ఆస్తులు, కశ్మీరీ పండితులే ఉగ్రవాదుల లక్ష్యం​!

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Jammu Kashmir : పాక్​ ఉగ్రవాదుల తదుపరి దాడుల ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భారత్​ రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్లు, కశ్మీర్ లోయలో పనిచేసే స్థానికేతరులే లక్ష్యంగా దాడులు చేయాలని ఉగ్రవాదులు (Terrorist Attack) ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పహల్గావ్​ ఉగ్రదాడి తర్వాత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టినట్లు తెలుస్తోంది.

    జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో పనిచేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కశ్మీర్​లో పనిచేసే రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తమ బ్యారక్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

    మరోవైపు కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్తాన్​ ఐఎస్ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. వీరితోపాటు శ్రీనగర్, గాందెర్బల్ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి సైతం హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...