ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Rythu Bharosa | రెండు ఎకరాల్లోపు రైతులకు రైతుభరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా(Ryrthu Bharosa) నిధులు జమ చేస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులను సోమవారం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోజమ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం సాయంత్రం రేవంత్​రెడ్డి నిధులు విడుదల చేయగా రాత్రి వరకు రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులకు నిధులు జమ అయ్యాయి.

    Rythu Bharosa | ఎప్పుడు లేనంత వేగంగా..

    రాష్ట్రంలో ఎప్పుడైనా రైతు భరోసా మొదట ఎకరంలోపు రైతులకు(Farmers) విడుదల చేసేవారు. అనంతరం రెండు, తర్వాత మూడు ఎకరాల్లోపు.. ఇలా విడతల వారీగా నిధులు విడుదల చేసేవారు. కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress government) వచ్చాక అయితే నిధుల విడుదలతో తీవ్ర జాప్యం నెలకొంది. గత యాసంగి సీజన్​కు సంబంధించి నాలుగు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. అయితే వానాకాలం సీజన్​కు మాత్రం వేగంగా రైతు భరోసా జమ చేస్తుండడం గమనార్హం.

    Rythu Bharosa | 41.25 లక్షల రైతులకు..

    రాష్ట్ర ప్రభుత్వం(State Government) తొలిరోజు రెండు ఎకరాల్లో భూమి ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ఇందులో ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 24,22,678 మంది, ఎకరా నుంచి రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారు 17,02,611 మంది రైతులు ఉన్నారు. మొత్తం 41.25 లక్షల రైతుల ఖాతాల్లో 39.16 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,349 కోట్లు జమ చేసింది. మంగళవారం మూడు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. తొమ్మిది రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.

    Rythu Bharosa | రైతుల హర్షం

    ప్రస్తుతం రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సకాలంలో పెట్టుబడి సాయం జమ చేయడంతో రైతులు(Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తే సాగు పెట్టుబడి ఎంతో ఉపయోగ పడతాయని రైతులు పేర్కొంటున్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...