ePaper
More
    Homeజిల్లాలుజగిత్యాలkorutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

    korutla | కోరుట్లలో విషాదం.. కరెంట్​ షాక్​తో ఇద్దరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : korutla | జగిత్యాల జిల్లా (Jagtial district) కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కరెంట్​ షాక్​ (electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అల్వాల వినోద్​, బంటి సాయి అనే ఇద్దరు కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే షెడ్డులో ఉన్న విగ్రహాలు తడిగా ఉండటంతో ఆదివారం పక్కనే ఉన్న మరో షెడ్డులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యుత్​ తీగలకు వినాయక విగ్రహం తగలడంతో అల్వాల వినోద్​, బంటి సాయి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Urea Shortage | యూరియా కొర‌త‌కు బీజేపీదే బాధ్య‌త‌.. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Shortage | తెలంగాణ‌లో యూరియా కొర‌తకు కార‌ణం బీజేపీయేన‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్...

    HMDA | హెచ్​ఎండీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేపట్టిన ఆర్​ఆర్​ఆర్​ భూ నిర్వాసితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA | హైదరాబాద్ (Hyderabad)​ చుట్టూ రీజినల్​ రింగ్​ రోడ్డు (RRR) నిర్మాణానికి రాష్ట్ర...

    Ganesh immersion | ఎల్లారెడ్డిలో ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh immersion | పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముసిగింది. 11 రోజులుగా...