అక్షరటుడే, ఇందూరు: రాధాకృష్ణ విద్యాలయం (Radhakrishna Vidyalayam) (ఆర్య సమాజం) ఉపాధ్యాయురాలు, ధార్మికవేత్త సమత ఆదివారం కన్నుమూశారు. ఆర్య సమాజంలో (Arya Samaj) సుమారు 35 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేసి 2008లో పదవీ విరమణ పొందారు. ఎందరో పేద విద్యార్థులకు అండగా నిలిచి ఉన్నత చదువులకు సహకరించారు. అలాగే వివేకానంద పాఠశాల (Vivekananda School) వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. గాయనిగా, జంతు ప్రేమికురాలుగా ప్రాచుర్యం పొందారు. అనారోగ్యం కారణంగా ఆదివారం మరణించారు.