అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై సందీప్ (SI sandeep) తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారనే సమాచారంతో లోలం వాగులో (Lolam Vagu) తనిఖీలు చేశామన్నారు. అక్కడ ఇసుకను లోడ్ చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను గుర్తించామన్నారు. వారి వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.