అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | ఏ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో బీజేపీ (BJP) గెలుస్తుందని ఎంపీ అర్వింద్ (MP Arvind) ధీమా వ్యక్తం చేశారు. ఈనెల చివరి వారంలో ఇందూరుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండే పార్టీలు గెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందన్నారు. నగరంలో కాంగ్రెస్కు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఆయన అన్నారు. టికెట్ రాని వారు ఎవరైనా తప్పేదారి బీజేపీ నుంచి వెళ్తే వారే ఆ పార్టీకి దిక్కు అవుతారని వ్యాఖ్యానించారు.
MP Arvind | ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లే..
నగరంలో కొందరు నాయకులు బీజేపీ నుంచి టికెట్ రాకపోతే కాంగ్రెస్ (congress)లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు. ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పని చేసేవారికి టికెట్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తాను సర్వే చేసినట్లు తెలిపారు. బీజేపీ టికెట్ వస్తే పోటీ చేయాలని, రాకపోతే వచ్చిన వారిని గెలిపించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ వారికి తర్వాత ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్లో జిల్లా పరిషత్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ప్రజలు బీజేపీకి తప్పా ఇతర పార్టీలకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.