అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | ఏటీఎం మిషన్లలో డిపాజిట్ చేయాల్సిన రూ.45 లక్షలతో సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి పరారైనట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో (Yellammagutta) ఉన్న ఓ ఏజెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు సదరు ఏజెన్సీకి అప్పగిస్తారు. అయితే ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన సుమారు రూ.45 లక్షలను బోధన్లోని ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సి ఉంది. కాగా.. ఆ డబ్బును సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై నాలుగో టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.