ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | భార్య చివ‌రి కోరిక తీర్చాల‌ని ఇండియాకి వ‌చ్చి విమాన ప్ర‌మాదంలో...

    Ahmedabad Plane Crash | భార్య చివ‌రి కోరిక తీర్చాల‌ని ఇండియాకి వ‌చ్చి విమాన ప్ర‌మాదంలో మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లో London ని గాట్విక్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానం(Flight)లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంబంధించిన విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎన్నో క‌ల‌లో కొంద‌రు ఫ్లైట్ ఎక్క‌గా, ఊహించ‌ని విధంగా క‌న్ను మూసారు. విమానం గాల్లోకి లేచిన తర్వాత కేవలం 672 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకోగలిగింది, ఆ తర్వాత అదుపుతప్పి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని మేఘానీ నగర్‌లోని బీజే మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్‌(BJ Medical College Complex)లోని ఒక భవనంపై కూలిపోయింది.

    Ahmedabad Plane Crash | అనాథ‌లైన పిల్ల‌లు..

    అయితే భార్య అంతిమ కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని నర్మదాNarmada నదిలో కలపడానికి లండన్‌ నుంచి వచ్చిన ఇండో బ్రిటీషర్‌(Britisher) అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరణించాడు. లండన్‌ కేంద్రంగా నివసిస్తున్న అర్జున్‌ మనుభాయ్‌ పటోలియా (36), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య భారతీబెన్‌ కన్నుమూసింది. నేను చనిపోతే నా అస్థికలు గుజరాత్‌లోని మా ఊర్లోని ఓ చెరువులో కలపండి అని కోరింది. ఆ మాట చెప్పి ఆమె చనిపోయింది. భార్య చివరి కోరిక తీర్చేందుకు భర్త లండన్‌ నుంచి ఇండియాకు వచ్చాడు. తన చివరి కోరిక తీరిస్తూ.. ఆమె అస్థికలను చెరువులో కలిపాడు.

    తన భార్య అంతిమ కోరిక తీర్చాననే ఆత్మ సంతృప్తితో లండన్‌ తిరిగి వెళ్లేందుకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport)లో విమానం ఎక్కాడు. పాపం.. కొన్ని నిమిషాల్లోనే అతను కూడా అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అర్జున్ పటోలియా arjun patolia తన భార్య భారతి, ఎనిమిది, నాలుగు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు కుమార్తెలతో లండన్‌లో నివసించారు. భార్య కోరికని తీర్చ‌డానికి లండ‌న్(London) నుండి వ‌చ్చాడు అర్జున్. అయితే అర్జున్ అహ్మదాబాద్ నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం(Air India plane) 171 ఎక్కి 241తో పాటు అతను కూడా మృత్యువడిలోకి జారుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు సహా 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన 32 సెకన్లకే కూలిపోయిన విషయం తెలిసిందే.

    Latest articles

    Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల...

    Mla madan Mohan Rao | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు...

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే...

    CBI Trap | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఎన్​హెచ్​ఏఐ పీడీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | లంచం తీసుకుంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways...

    More like this

    Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల...

    Mla madan Mohan Rao | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు...

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే...