- Advertisement -
HomeUncategorizedArmy Chief | ఆర్మీ చీఫ్​ పర్యటనలో ‘కురుక్షేత్రం’ ఫొటో.. పాక్​కు వార్నింగ్​ ఇవ్వడానికేనా..

Army Chief | ఆర్మీ చీఫ్​ పర్యటనలో ‘కురుక్షేత్రం’ ఫొటో.. పాక్​కు వార్నింగ్​ ఇవ్వడానికేనా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Army Chief | పహల్​గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత ఆర్మీ ఛీప్​ ఉపేంద్ర ద్వివేది Indian Army Chief Upendra Dwivedi శుక్రవారం జమ్మూ కశ్మీర్​లో  పర్యటించారు. శ్రీనగర్​లో srinagar ఆర్మీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలాగే పహల్​గామ్​​లో ఉగ్ర దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జమ్మూ కశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​తో Lieutenant Governor భేటీ అయి ఉగ్రదాడి అనంతరం చేపట్టిన చర్యలను వివరించారు. ఆయన పర్యటన సందర్భంగా అధికారులతో మాట్లాడుతున్న చిత్రంలో కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడి ఫొటో ఉంది. దీంతో పాకిస్తాన్​ pakistanకు హెచ్చరికలు పంపడానికే ఈ ఫొటో పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ధర్మ యుద్ధమని తెలిపేలా ఆ ఫొటోతో సందేశం పంపినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Army Chief | మెరుపు దాడి తప్పదా..

ఉగ్రదాడితో ఆగ్రహంగా ఉన్న భారత్​ ఏ క్షణామైనా పాక్​పై మెరుపు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీవోకేలో 17 ఉగ్రవాద శిబిరాలు Terrorist camps ఉన్నట్లు గుర్తించారు. భారత్​లో చొరబడి దాడులు చేయడానికి అక్కడ శిక్షణ ఇస్తున్నారని, 37 లాంచింగ్​ ప్యాడ్స్​ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్​ మళ్లీ సర్జికల్​ స్ట్రైక్​ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత త్రివిద దళాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News