- Advertisement -
HomeతెలంగాణHyderabad | పాకిస్తానీయులను తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వ ఆదేశం.. హైదరాబాద్​లో ఎంతమంది ఉన్నారో తెలుసా..!

Hyderabad | పాకిస్తానీయులను తిరిగి వెళ్లిపోవాలని ప్రభుత్వ ఆదేశం.. హైదరాబాద్​లో ఎంతమంది ఉన్నారో తెలుసా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | జమ్మూకశ్మీర్​లోని పహల్​గామ్​లో ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India)​ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసింది. దీంతో ఆ దేశస్తులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా(Union Home Minister Amit Shah) నేడు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్​ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లోని పాకిస్తాన్​ ప్రజలను పంపించేయాలని చెప్పారు.

Hyderabad | హైదరాబాద్​లో ఎంత మంది ఉన్నారంటే..

అమిత్​ షా(Amith Shah) నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(State Chief Minister Revanth Reddy)కి ఫోన్​ చేశారు. హైదరాబాద్‌లోని 200 మందికి పైగా పాకిస్థానీయులు వెంటనే తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్(High Alert)​ ప్రకటించింది. పాకిస్తాన్​కు చెందిన ప్రజలను వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News