ePaper
More
    HomeజాతీయంEmergency Landing | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

    Emergency Landing | ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Emergency Landing | వరుస ఘటనలతో విమానాల్లో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. గురువారం అహ్మదాబాద్(Ahmedabad)​లో విమానం కూలిపోయి ప్రయాణికులు సహా 265 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్–ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు విమానాలు రద్దయ్యాయి. ఇరాన్​ తన గగనతలాన్ని మూసివేయడంతో లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) ఏకంగా మూడు గంటలు గాలిలోనే ఉండిపోయింది.

    అనంతరం తిరిగి ముంబయి ఎయిర్​పోర్టు(Mumbai Airport)కు చేరుకుంది. తాజాగా మరో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్(Emergency landing)​ అయ్యింది. ఎయిర్‌ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు(Bomb threat) రావడం తీవ్ర కలకలం రేపింది. థాయ్​లాండ్​లోని పుకెట్‌ నుంచి ఢిల్లీ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అండమాన్ సముద్రంపై కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు థాయిలాండ్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. లాండ్​ అయిన తర్వాత ప్రయాణికులను దించేసి విమానంలో బాంబు స్క్వాడ్​ తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...