TPPC Chief
TPPC Chief | టీపీపీసీ చీఫ్​ను కలిసిన కాంగ్రెస్​ నాయకులు

అక్షరటుడే, ఇందూరు: TPPC Chief | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ఇటీవల ప్రకటించింది. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన రాంభూపాల్​కు టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ పదవి దక్కింది. దీంతో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ను హైదరాబాద్​లో కలిశారు. ఈ సందర్భంగా మహేశ్​ కుమార్​ గౌడ్​ను సన్మానించారు. తనకు పదవీ రావడంలో కృషి చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్​ను కలిసిన వారిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మెంబర్​ జీవీ రామకృష్ణ, మనోహర్​, భాస్కర్​, నరేందర్​, నాగరాజు, సంతోష్​, పుప్పాల రవి, అజహర్​ తదితరులు ఉన్నారు.