ePaper
More
    Homeక్రైంDelhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

    Delhi | మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi | అహ్మదాబాద్​లో విమాన ప్రమాదం (Ahmedabad Plane crash) దేశంలో తీరని విషాదం నింపింది. విమాన ప్రమాదం విషాదం మరువక ముందే ఢిల్లీ(Delhi)లో ఓ రైలు పట్టాలు తప్పింది. హజ్రత్ నిజాముద్దీన్ –ఘజియాబాద్ మధ్య నడుస్తున్న రైలు గురువారం మధ్యాహ్నం శివాజీ బ్రిడ్జి స్టేషన్ (Shivaji Bridge Station) సమీపంలో పట్టాలు తప్పింది. ప్యాసింజర్ రైలు నాలుగో కోచ్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

    Delhi | రైళ్ల దారి మళ్లింపు

    రైలు పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గం నడిచే రైళ్లను దారి మళ్లించారు. రద్దీగా ఉండే మార్గంలో ఉన్న అనేక రైళ్లు ఆలస్యం అయ్యాయి. అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్రేన్​ సాయంతో ఆ కోచ్​ను తొలగించారు. కాగా రైలు పట్టాలు తప్పడంపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు. సాయంత్రంలోగా ట్రాక్​ను సరి చేసిన అధికారులు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...