అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | వివాహేతర సంబంధమే పంచాయతీ కార్యదర్శి హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్నకొడప్గల్(Chinna Godapgal) గ్రామానికి చెందిన లింగంపేట మల్కయ్యకు వివాహమైంది. మల్కయ్య బతుకు దెరువు కోసం నాలుగునెలలు హైదరాబాద్కు (Hyderabad) వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అయితే తన భార్యతో పంచాయతీ కార్యదర్శి దారావత్ కృష్ణకు (Panchayat Secretary Darawat Krishna) వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకున్న మల్కయ్య నిత్యం భార్యతో గొడవపడేవాడు.
అనంతరం కృష్ణను ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో తన భార్యతో ఈనెల 5న కృష్ణకు ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. అక్కడ మరో ఇద్దరు ఎర్రన్నోళ్ల బాలరాజు, లింగంపేట మల్యయ్యతో కలిసి కృష్ణను గొడ్డలి, కత్తి, ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చారు. అనంతరం కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పడేశారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వస్తువులు, రెండు బైక్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్, ఎస్సై రాజు, సిబ్బంది ఎస్పీ అభినందించారు.