అక్షరటుడే, బాన్సువాడ: Birkur mandal | ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బీర్కూరు మండలం (Birkur mandal) కిష్టాపూర్ లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చించోలికి చెందిన గంగారాం, అన్నారం గ్రామానికి (Annaram village) చెందిన నవీన్ బైకుపై వెళ్తూ.. ఎదురెదురుగా ఢీ కొన్నారు. దీంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
