ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Sakshi Office | ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు

    Sakshi Office | ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sakshi Office | ఆంధ్రప్రదేశ్​(ap)లో సాక్షి కార్యాలయాల(Sakshi Office)పై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల సాక్షి టీవీ (Sakshi TV)లో ప్రసారం అయిన ఓ డిబేట్​లో అమరావతి (Amaravati) మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్​ జర్నలిస్ట్​ కొమ్మినేని శ్రీనివాసరావు (KSR)ను అరెస్ట్​ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్​ కూడా విధించింది.

    ఆ వ్యాఖ్యలపై జగన్ (YS Jagan)​, సాక్షి మీడియా అధినేత భారతి (YS Bharati) క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా సాక్షి కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల దాడులకు కూడా పాల్పడ్డారు. తాజాగా మంగళవారం ఏలూరులోని సాక్షి కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్​, సోఫా సెట్లు కాలిపోయాయి. కార్యాలయం ఎదుట ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు.

    సాక్షి కార్యాలయానికి టీడీపీ(TDP) నేతలే నిప్పు పెట్టారని వైసీపీ (YCP) ఆరోపిస్తోంది. కాగా.. దీనిని టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తాము ర్యాలీగా వెళ్తుంటే నిందలు మోపుతున్నారని వారు పేర్కొన్నారు.

    More like this

    Devi Navarathrulu | శరన్నవరాత్రులు.. ఈసారి 11 రోజులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devi Navarathrulu | సనాతన ధర్మాన్ని అనుసరించేవారు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రధానంగా...

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 13 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 13,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....