అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద కొడప్గల్ (Peddagodapgal) మండల జీపీ కార్యదర్శులు (GP Secretaries) నిరసన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో లక్ష్మీకాంతారెడ్డికి వినతిపత్రం అందించారు. విధుల్లో సమస్యలతో సతమతమవుతున్నామని, నిధులు విడుదల కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
