ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | మూగజీవాలతో వాహనదారులకు ఇబ్బందులు

    Lingampet | మూగజీవాలతో వాహనదారులకు ఇబ్బందులు

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని కేకేవై రహదారిపై (KKY Road) పశువులు తిష్ట వేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు రోడ్లపై తిరుగుతుండడంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆవుల యజమానులు ఇష్టారాజ్యంగా వాటిని రోడ్లపై వదిలేస్తుండడంతో ట్రాఫిక్​ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాపోతున్నారు. గతేడాది ఇలాగే జరిగితే పశువులను రోడ్లపై వదిలేసే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లపై పశువులు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

    More like this

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...