ePaper
More
    HomeజాతీయంMumbai Local Trains | రైలులో నుంచి జారిపడి ఐదుగురి మృతి

    Mumbai Local Trains | రైలులో నుంచి జారిపడి ఐదుగురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mumbai Local Trains | మహారాష్ట్రలోని ముంబై(Mumbai)లో విషాద ఘటన చోటు చేసుకుంది. నడుస్తున్న రైలు (Moving Train) నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు (Travelers) మృతి చెందారు.

    లోకల్‌ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్(Chhatrapati Shivaji Maharaj Terminal)​కు వెళ్తుండగా ముంబ్రా- దివా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్- కసారా ​​లోకల్ ట్రెయిన్లు ఒకదానిని ఒకటి దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    లోకల్​ ట్రెయిన్(Local Train)​ నుంచి దాదాపు 12 మంది కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిని అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముంబై లోకల్​ రైళ్లలో అధిక రద్దీ సర్వసాధారణం. నిత్యం అక్కడ డోర్ల వద్ద నిలబడి ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సైతం అధిక రద్దీ ఉండటంతో ప్రజలు డోర్​ వద్ద వేలాడుతూ నిలబడ్డారు. ఈ క్రమంలో 12 మంది జారి కిందపడగా.. ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.

    More like this

    Google Pixel 9 | భలే మంచి చౌక భేరమూ.. సగం ధరకే గూగుల్‌ పిక్సెల్‌ 9

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Google Pixel 9 | సుమారు రూ. 80 వేల విలువైన గూగుల్‌ పిక్సెల్‌(Google...

    Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

    అక్షరటుడే, కామారెడ్డి: Cyber ​​Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్...

    Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగింది. అయితే...