deemed university | డీమ్డ్ వర్సిటీ హోదా ఇవ్వడంపై యూజీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు
deemed university | డీమ్డ్ వర్సిటీ హోదా ఇవ్వడంపై యూజీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు telangana high court సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ cbi, ఈడీ ed విచారణ చేస్తే కానీ వాస్తవాలు బయటికి వచ్చేలా లేవని కోర్టు వ్యాఖ్యానించింది. మహేశ్వరం maheswaram మండలం నాగారం భూదాన్​ భూముల్లో budhan lands అక్రమాలు జరిగాయాని మహేశ్​ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్​పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది​ వాదిస్తూ భూదాన్​ భూములను కొందరు ఐఏఎస్ ias​, ఐపీఎస్​ ips అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్​ చేసుకున్నారని పేర్కొన్నారు. అక్రమాలపై ప్రభుత్వం, భూదాన్​ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమాలపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా జడ్జి స్పందిస్తూ విచారణ చేయగలరో, లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు పంపారు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించారు. విచారణను జూన్​ 26కు వాయిదా వేశారు.