ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Sajjala Ramakrishna Reddy | ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది : సజ్జల

    Sajjala Ramakrishna Reddy | ఏపీలో రెడ్‌ బుక్‌ పాలన నడుస్తోంది : సజ్జల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjala Ramakrishna Reddy | ఆంధ్రప్రదేశ్​లో రెడ్​ బుక్​ పాలన (Red Book Rule) నడుస్తోందని వైఎస్సార్​సీపీ (YSRCP) నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్‌ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీ హయాంలో తాము ఫ్రెండ్లీ పోలీసింగ్‌ (Friendly Policing) అమలు చేశామన్నారు. కానీ నేడు రక్షించేవారే అరాచక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సమర్థులైన అధికారులను వీఆర్‌లో ఉంచుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో దాడి చేసిన పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పొలిటికల్‌ బాస్‌లు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. దీంతో సామాన్యులు పోలీస్​ స్టేషన్​కు రావాలంటే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...