అక్షరటుడే, నిజాంసాగర్: MLA Thota Lakshmi Kantarao : అనారోగ్యంతో హైదరాబాద్లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్(MP Suresh Shetkar), గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు & పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డా. నాగేశ్వర్ రెడ్డి, డా. దువ్వూరు ద్వారకనాథ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.
