ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్​ మార్పు

    Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్​ మార్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మెట్ల మార్గంలో నడిచి చాలా మంది స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. అయితే మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లను పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. దివ్యదర్శనం టోకెన్లు ఇప్పిస్తానంటూ పలువురు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు భక్తులను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ(TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ కౌంటర్​ను మార్చింది.

    Tirumala | భూదేవి కాంప్లెక్స్​లోకి మార్పు..

    శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్(Bhudevi Complex)​కు మార్చాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్​లో అందుబాటులోకి రానున్నాయి. టోకెన్ల సంఖ్య ఆధారంగా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన కేటాయించనున్నారు. దివ్యదర్శనం టోకెన్​ పొందిన భక్తులు(Devotees) తమ ఆధార్ కార్డు చూపించి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. నిత్యం 5వేల దివ్య దిర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇదే సమయంలో ఎస్​ఎస్​డీ టోకెన్ల(SSD tokens)ను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్​లోని కౌంటర్లలో అందిస్తారు.

    Tirumala | ఇబ్బందులు లేకుండా టోకెన్ల పంపిణీ

    భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్(TTD Vigilance), సెక్యూరిటీ(Security), పోలీసులు(Police) సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించనున్నారు. టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను టీటీడీ ఈవో సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...