ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Yellareddy | ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా..

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఈత సరదా ముగ్గురు ముగ్గురు యువకులు ప్రాణాలను బలిగింది. నిజాంసాగర్​ ప్రాజెక్ట్(Nizamsagar Project)​ బ్యాక్​ వాటర్​ వద్ద సోమవారం సాయంత్రం ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. 16 గంటల పాటు పోలీసులు(Police), రెస్క్యూటీం(rescue team), గజ ఈతగాళ్లు(swimmers) కలిసి శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. బొగ్గుగుడిసెకు చెందిన మధుకర్​ గౌడ్​(18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతే నవీన్​(21), సోమార్​పేట్​కు చెందిన బెస్త హర్షవర్ధన్​(17)లు మరికొందరు యువకులతో కలిసి సోమార్​పేట్​ సమీపంలో క్రికెట్​ ఆడేందుకు వెళ్లారు. అనంతరం యువకులంతా నిజాంసాగర్​ బ్యాక్​ వాటర్​లో స్నానం చేసేందుకు నీటిలో దిగారు.

    అయితే అందులో ముగ్గురు యువకులు మధుకర్​ గౌడ్​, నవీన్​, హర్షవర్ధన్​ మాత్రం నీళ్లలో గల్లంతయ్యారు. దీంతో మిగతావారు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం అర్ధరాత్రి వరకు వెతికించారు. మంగళవారం ఉదయం ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మధ్యాహ్నానికి మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాలను కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders) కురుమ సాయిబాబా, విద్యాసాగర్​, సామెల్​, శ్రీనివాస్​రెడ్డి, ప్రశాంత్​గౌడ్​, తిరుపతి, ననుగొండ శ్రీనివాసులు ఓదార్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్​(CI Rajesh) తెలిపారు.

    Yellareddy | బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

    నిజాంసాగర్​ బ్యాక్​వాటర్(Nizamsagar Back Water)​లో ఈతకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను ఎమ్మెల్యే మదన్​మోహన్(MLA Madan Mohan) పరామర్శించారు. యువకుల మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేతికి అందివచ్చిన కొడుకులు అకాల మరణం చెందడం తల్లిదండ్రులకు గుండెకోతేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​(Collector)కు సూచించారు.

    Yellareddy | మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్..

    బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​(Former MLA Nallamadugu Surender) పరామర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనా జరిగిన ప్రదేశంలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వారిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిర్వహించి త్వరగా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆయన అధికారులకు సూచించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...