- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిFarmers strike | తరుగు పేరుతో మోసం.. రోడ్డెక్కిన అన్నదాతలు

Farmers strike | తరుగు పేరుతో మోసం.. రోడ్డెక్కిన అన్నదాతలు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Farmers strike | ధాన్యాన్ని విక్రయించేందుకు paddy purchase రైతులు అష్టకష్టాలు పడుతుండగా.. ఇదే అదనుగా భావిస్తున్న రైస్​మిల్లర్లు Rice millers తరుగు పేరుతో అన్నదాతలను నిండా ముంచుతున్నారు. ఒక లారీ నుంచి సుమారు 8 నుంచి 11 క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగు పేరుతో దోచుకోవడంతో అన్నదాతలు formars రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.

Farmers strike | నాగిరెడ్డిపేటలో రాస్తారోకో

నాగిరెడ్డిపేట Nagireddypet మండలం కేంద్రంలో గురువారం తరుగు పేరుతో లారీకి 11 క్వింటాళ్ల వరకు ధాన్యాన్ని తీస్తుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో హెచ్​ఎంబీ జాతీయ రహదారిపై HMB National Highway బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు రైతులను సముదాయించారు.

- Advertisement -

Farmers strike | ప్రతి ఏడాది ఇదేతంతు..

ప్రతి ఏడాది తరుగు విషయంలో రైస్​మిల్లర్లు rice millers nizamabad మోసాలకు పాల్పడుతూనే ఉన్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారినా తరుగు మోసాల్లో ఎలాంటి మార్పులు ఉండట్లేదని ఆగ్రహిస్తున్నారు. అధికారులు స్పందించాలని రైతులు వేడుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News