అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad News | హైదరాబాద్(Hyderabad city) సిటీలోని యాకుత్పురాలో విషాదం చోటు చేసుకుంది.
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. గొర్రెల మేత కోసం యాకుత్పురా రైల్వేస్టేషన్ (Yakutpura Railway Station) సమీపంలోని చెట్టుపైకి ఇద్దరు అన్నదమ్ములు ఎక్కారు. అయితే చెట్టు కొమ్మ విరిగడంతో వారు రైలు పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో రైలు (Train) వచ్చింది. పట్టాలపై పడ్డ సోదరులను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.