ePaper
More
    HomeతెలంగాణBRS | రాష్ట్రాన్ని రేవంత్​రెడ్డి నాశనం చేస్తున్నారు: ప్రశాంత్ రెడ్డి

    BRS | రాష్ట్రాన్ని రేవంత్​రెడ్డి నాశనం చేస్తున్నారు: ప్రశాంత్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:BRS | కష్టపడి సాధించుకున్న తెలంగాణ(Telangana)ను కేసీఆర్​ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan)​ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిజామాబాద్​ నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద వారు నివాళులు అర్పించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్(KCR) తెలంగాణ సాధించారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళలు, సబ్బండ వర్ణాలు అన్ని ఒక్క దిక్కు నిలిచి తెలంగాణ కోసం నాడు కేసీఆర్ వెంట నడిచాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించుకొని 11 ఏళ్లు అవుతోందన్నారు.

    తెలంగాణలో కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని జనరంజక పాలన అందించారని చెప్పారు. ఆయన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు. రేవంత్​రెడ్డి(cm Revanth Reddy) పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే రాష్ట్ర తలసరి ఆదాయంలో 4వ స్థానానికి ,GSDPలో 13వ స్థానానికి పడిపోయిందన్నారు. రాష్ట్ర​ ప్రభుత్వం (Congress government) ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...