ePaper
More
    HomeజాతీయంProject Kusha | భారత్​ అమ్ముల పొదిలో మరో అస్త్రం.. ప్రాజెక్ట్​ కుశ విశేషాలివే..

    Project Kusha | భారత్​ అమ్ముల పొదిలో మరో అస్త్రం.. ప్రాజెక్ట్​ కుశ విశేషాలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Project Kusha | ఇజ్రాయెల్​(Israel​)పై హమాస్​ దాడి చేసిన సమయంలో ఆ దేశ గగన తల రక్షణ వ్యవస్థ ఐరన్​ డోమ్ ​(Iron Dome) ఎంతో ప్రభావం చూపించింది. హమాస్​ ప్రయోగించిన వందల రాకెట్లను ఇజ్రాయెల్​ ఐరన్​ డోమ్​ సిస్టం మధ్యలోనే ఆపేసింది.

    ఆ సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ గురించి అన్ని దేశాలు ఆలోచించడం మొదలు పెట్టాయి. భారత్​ కూడా శత్రుదేశాల నుంచి రక్షణ కోసం రష్యా నుంచి ఎస్​–400 ను కొనుగోలు చేసింది. ఇటీవల ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ సమయంలో పాక్​ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను సుదర్శన చక్ర(ఎస్​–400) సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే భారత్​ సొంతంగా గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దానికి ప్రాజెక్ట్​ కుశ (Project Kusha) అని పేరు పెట్టింది. ఇటీవల భారత్, పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాజెక్ట్​ కుశను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది.

    Project Kusha | స్వదేశీ టెక్నాలజీతో..

    రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి దిశగా భారీ ముందడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ కుశ కింద రష్యా యొక్క S-400 మాదిరిగా సొంతంగా ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను డెవలప్​ చేస్తోంది. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి (SAM) వ్యవస్థను రూపొందిస్తోంది.

    Project Kusha | వచ్చే ఏడాది ప్రయోగాలు..

    దూరం నుంచే శత్రుదేశాల లక్ష్యాలను ఛేదించడానికి భారత్​ ప్రాజెక్ట్​ కుశ ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్​ మరో 12 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రయోగాలు చేయనున్నారు. దీని పనితీరు పరీక్షించడానికి ప్రాజెక్ట్ కాల వ్యవధి 12 నుంచి 36 నెలలు పొడిగించే అవకాశం ఉంది. బీఈఎల్(BEL)​ అధునాతన నియంత్రణ వ్యవస్థలు, రాడార్ టెక్నాలజీ(Radar Technology)ల వంటి ప్రాజెక్ట్ కుషా యొక్క ముఖ్యమైన ఉపవ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది.

    Project Kusha | త్వరలో మరిన్ని ఎస్​–400 వ్యవస్థలు

    భారత్​ రష్యా నుంచి ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేయడానికి 2018లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ 5.4 బిలియన్​ డాలర్లు. దీని ప్రకారం రష్యా ఇప్పటికే భారత్​కు మూడు ఎస్​–400 యూనిట్లను డెలివరీ చేసింది. ఇటీవల భారత్– పాక్​ ఉద్రిక్తతల నేపథ్యంలో మిగతా రెండు యూనిట్లను కూడా త్వరగా డెలివరీ చేయాలని భారత్ కోరింది. దీంతో 2026 చివరి నాటికి మిగిలిన యూనిట్లకు అందించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది.

    ఎస్​–400 వ్యవస్థతో ​ ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే మేకిన్​ ఇండియా(Make in India) వైపు మళ్లుతున్న భారత్​.. గగన తల రక్షణ వ్యవస్థలోనూ దేశీయం​గా అభివృద్ధి చేసిన టెక్నాలజీ అవసరం అని భావించింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్​ కుశ మొదలుపెట్టింది. గగనతల రక్షణలో స్వదేశీ టెక్నాలజీతో రూపొందుతన్న ప్రాజెక్ట్ కుశ ఒక కీలక అడుగు కానుంది. ప్రయోగాలు విజయవంతం అయి ఇది అందుబాటులోకి వస్తే భారత్​ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

    Latest articles

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు.. భారీగా నీటి వృథా

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    More like this

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు.. భారీగా నీటి వృథా

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...