అక్షరటుడే, వెబ్ డెస్క్: Jai Hind Yatra | ఏఐసీసీ పిలుపు మేరకు బాచుపల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జైహింద్ యాత్ర చేపట్టారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల (PNR Engineering College) నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (AICC in-charge Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC president Mahesh Kumar Goud), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సభ్యులు రోహిత్ చౌదరి, సంపత్ కుమార్ కంటెస్టెడ్ అభ్యర్థులు, కాంగ్రెస్ కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.