Nizamabad City
Nizamabad City | 1న టీయూసీఐ జిల్లా మహాసభ

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభలు జూన్ 1న నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి సుధాకర్ (General Secretary Sudhakar) తెలిపారు. బుధవారం నగరంలోని కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్ఆర్ భవన్​లో ఉంటుందన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీ (gram panchayat), కేజీబీవీ, మోడల్ స్కూల్, భవన నిర్మాణ రంగం, మిషన్ భగీరథ, హమాలీ, మోటార్​ రంగ కార్మికులు, బీడీ కార్మికుల కోసం రాజీలేని పోరాటం చేశామన్నారు. వారంతా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీయుసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, రాజేశ్వర్, సహాయ కార్యదర్శి మల్లేష్, కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.