ePaper
More
    HomeతెలంగాణEducation Department | సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Education Department | సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో అశోక్ (DEO Ashok)​ అన్నారు. నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School) గెజిటెడ్​ హెడ్​మాస్టర్లకు, జీవశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్ల బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.

    అనంతరం గెజిటెడ్​ హెచ్​ఎంలకు డాక్టర్​ జలగం తిరుపతి రావు (Dr. Jalagam Tirupati Rao) ఆధ్వర్యంలో మోటివేషన్​ తరగతులు (Motivation classes) నిర్వహించారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులకు హెల్త్​ ఎడ్యుకేటర్లు వెంకటేశ్వర్లు, స్వామిసులోచన అవగాహన కల్పించారు. లాటే షీటీం యాక్టివిటీస్​ గురించి షీటీం ఎస్సై స్రవంతి అవగాహన కల్పించారు. సైకియాట్రిస్ట్​ ​వివేక్ విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.​ ​శిక్షణ కార్యక్రమంలో 95మంది హెచ్​ఎంలు, 201 మంది బయోసైన్స్​ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెంటర్​ ఇన్​ఛార్జి శంకర్​ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...