ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | పహల్గామ్‌లో జమ్మూకశ్మీర్‌ కేబినెట్​ భేటీ.. ఎందుకో తెలుసా?

    Jammu Kashmir | పహల్గామ్‌లో జమ్మూకశ్మీర్‌ కేబినెట్​ భేటీ.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jammu Kashmir | జమ్మూ కశ్మీర్ మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం పహల్గామ్​(Pahalgam)లో నిర్వహిస్తున్నారు. సాధారణంగా కేబినెట్​ భేటీ సచివాలయంలో నిర్వహిస్తారు. కానీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా (Chief Minister Omar Abdullah) ఇటీవల ఉగ్రదాడి జరిగిన పహల్గామ్​లో కేబినేట్​ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్​, శీతాకాల రాజధాని జమ్మూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెండు ప్రాంతాల్లో మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయి.

    Jammu Kashmir | పర్యాటకుల్లో విశ్వాసం కల్పించేలా..

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో ఏప్రిల్​ 22న ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను చంపారు. దీంతో పహల్గామ్‌లో పర్యాటకం దెబ్బతింది. పర్యాటకుల(Tourists) సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిలో విశ్వాసం కల్పించేలా పహల్గామ్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్​ సమావేశంలో పాల్గొన్న ఒమర్​ అబ్దుల్లా పర్యాటకుల్లో విశ్వాసం పెంపొందించడానికి చర్యలు చేపడుతామని ప్రధాని మోదీ(Prime Minister Modi)కి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిస్తామన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో చర్చించే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

    READ ALSO  Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఆరేళ్లు.. అభివృద్ధి బాట‌లో జమ్మూకశ్మీర్‌

    Jammu Kashmir | తగ్గిన పర్యాటకులు

    పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ చేపట్టింది. ఈ ఆపరేషన్​లో భాగంగా పీవోకే, పాక్​లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఇందులో వంద మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. అనంతరం పాక్​, భారత్​పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. పాక్​ దాడులను తిప్పి కొట్టిన భారత్​ దాయాదీ దేశంలోని ఎయిర్​బేస్​లను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. తదనంతరం కాల్పుల విరమణ జరిగింది. అయినా.. ఉగ్రదాడి భయంతో జమ్మూకశ్మీర్​కు పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా పర్యాటకులు కశ్మీర్​ వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల్లో భయం పొగొట్టేలా జమ్మూ కశ్మీర్​ ప్రభుత్వం (Jammu and Kashmir Government) చర్యలు చేపట్టింది.

    READ ALSO  MP Manish Tewari | కాంగ్రెస్‌లో మ‌రో ముస‌లం.. సొంత పార్టీపై ఎంపీ అస‌హనం.. పార్టీకి వ్య‌తిరేకంగా మ‌నీశ్ తివారీ పోస్టు

    Latest articles

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...

    India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని...

    BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి...

    More like this

    Stock Markets | ట్రంప్‌ బెదిరింపులు.. ఒత్తిడిలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లన్నీ పాజిటివ్‌గా ఉన్నా.. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులతో...

    Guvvala Balaraju | కేసీఆర్‌ ఫ్యామిలీ కొంత బాధలో ఉంది : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్​ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు...

    India-England Test | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై మొదటి అడుగులోనే వివాదం.. లెజెండ్స్ గైర్హాజరుపై దుమారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-England Test | భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ సంబంధాలకు కొత్త రూపాన్ని...