అక్షరటుడే, వెబ్డెస్క్ :Mumbai Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు(Heavy Rains in mumbai) ముంచెత్తాయి. సోమవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో జన జీవనం స్తంభించింది.
తుఫానుతో పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సబ్ అర్బన్ రైలు సేవలు, విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ (Traffic in mumbai) నిలిచిపోయింది. ముంబైలో అత్యధిక వర్షపాతం నారిమన్ పాయింట్ అగ్నిమాపక కేంద్రంలో 104 మి.మీ., వార్డ్ ఆఫీస్ (86 మి.మీ.), కొలాబా పంపింగ్ స్టేషన్ (83 మి.మీ.), మరియు మున్సిపల్ హెడ్ ఆఫీస్ 80 మి.మీ. వర్షపాతం నమోదైందని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. మరోవైపు, రానున్న 24 గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Mumbai Rains | విమాన రాకపోకలపై ప్రభావం..
ముంబై విమానాశ్రయానికి (Mumbai Airport flights timings) వచ్చే విమాన కార్యకలాపాలపై వర్షం ప్రభావం చూపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని ఎయిర్ ఇండియా(Air India Advisory) అడ్వైజరీ జారీ చేసింది. “ముంబైలో విమాన కార్యకలాపాలపై వర్షం, ఉరుములు ప్రభావం చూపుతున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే ముందు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని మా ప్రయాణీకులను సూచిస్తున్నాము ” అని ఎయిర్లైన్స్ Xలో పోస్ట్ చేసింది.
Mumbai Rains | రోడ్లపై నిలిచిన నీరు
ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టిటి ఈస్ట్, పరేల్ టిటి, కలచౌకి, చించ్పోక్లి, దాదర్ స్టేషన్ వంటి అనేక లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబైలోని శివారు ప్రాంతాలతో పోలిస్తే.. ద్వీప నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు, భారీ వర్షాల కారణంగా మసీదు, బైకుల్లా, దాదర్, మాతుంగా, బద్లాపూర్ స్టేషన్లలో సెంట్రల్ రైల్వే ట్రాక్(Railway Track)లపైకి నీరు చేరింది. దీంతో ఉదయం రద్దీ సమయంలో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్(Central railway chief public relations officer Swapnil) నీలా తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ cst terminal వైపు వెళ్లే రైళ్లలో ఆలస్యం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.