ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | సీఎంకు రైతుల కంటే అందాల పోటీలే ముఖ్యమా..?

    Mla Prashanth Reddy | సీఎంకు రైతుల కంటే అందాల పోటీలే ముఖ్యమా..?

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth Reddy | అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు ఆగమవుతున్నారని.. కానీ సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy)అందాల పోటీలే ముఖ్యమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో (Balkonda Constituency) కల్లాల వద్ద, రహదారులపై ఇప్పటికీ ధాన్యం రాశులు కుప్పలుగా ఉన్నాయని.. అయినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. వారి నిర్లక్ష్యంతోనే ధాన్యం వర్షం పాలవుతోందన్నారు. ధాన్యం సేకరణపై రివ్యూ చేయని సీఎం రేవంత్​రెడ్డి అందాలపోటీలపై ఇప్పటికీ ఎనిమిది సార్లు రివ్యూ చేశారని విమర్శించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈలో జరిగిన ఆసియా కప్ Asia Cup తొలి మ్యాచ్​లో...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...