అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | విశ్వకర్మల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన అభినందన సభను విజయవంతం చేయాలని అఖిల భారత విశ్వకర్మ పరిషత్ (All India Vishwakarma Parishad) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల చారి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో సభకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మల పనులకు సంబంధించి విద్యుత్ వినియోగాన్ని 10 హెచ్పీ నుంచి 25 హెచ్పీకి పెంచుతూ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి (CM Revanth reddy) అభినందనలు తెలుపుతూ సభ నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు కొండా సురేఖ, సీతక్క, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ (Deputy Chairman of the Legislative Council Banda Prakash), రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఛైర్మన్ డా.జస్టిస్ దేవరాజు నాగార్జున, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సీఎండీ వరుణ్ రెడ్డి(North Power Distribution CMD Varun Reddy), అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాచమల్ల పున్నమాచారి హాజరు కానున్నారన్నారు. సమావేశంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్, కంది నాగభూషణం, బెజ్జంకి రాజు తదితరులు పాల్గొన్నారు.