Nizamsagar
Intermediate Exam | ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. పరీక్షకు విద్యార్థి దూరం..!

అక్షరటుడే, నిజాంసాగర్:Inter Exams | ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థి పరీక్షకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన చింతల శంకర్ నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాల(Gurukul School)లో ఇంటర్ సెకండియర్​(సీఈసీ) చదువుతున్నాడు. ఫస్టియర్​ ఉత్తీర్ణులయ్యాడు. ప్రస్తుత విద్యాసంవత్సరం సెకండియర్​లో ఎకనామిక్స్​ మినహా అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యాడు. అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం గత నెల 30న పరీక్ష ఫీజు(Exam Fee)కు ఆఖరి తేదీ కావడంతో విద్యార్థి శంకర్ తండ్రి సాయిలు అదే రోజు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడికి ఫోన్​పే(Phone pay) ద్వారా డబ్బులు చెల్లించాడు.

అయితే ఉపాధ్యాయుడు కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator​)​కు ఫీజు డబ్బులు చెల్లించాలని వారి వద్ద నుంచి అతనికి డబ్బులను ట్రాన్స్​ఫర్​ చేశాడు. అయితే సప్లిమెంటరీ ఫీజు డబ్బులు చెల్లించామని అనుకున్నారు.కాగా.. హాల్ టికెట్(Hall Ticket) కోసం ఈనెల 20న ఫోన్ చేయడంతో హాల్ టికెట్ గురుకుల పాఠశాలకు వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో విద్యార్థి శంకర్​ తండ్రి సాయిలుతో పాటు గురుకుల పాఠశాలకు రాగా.. ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని విద్యార్థి హాల్ టికెట్(Student Hall Ticket) రాలేదని తెలిపారు. ఫీజు డబ్బులు చెల్లించలేదని పాఠశాల సమాధానం ఇచ్చారు. కానీ డబ్బులు చెల్లించామని వారు చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపాల్​కు ఫోన్​చేసి అడగగా ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని జిల్లా నోడల్ ఆఫీసర్(Nodal Officer)​కు మాట్లాడాలని చెప్పారు. లేదంటే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయానికి(Intermediate Board Office) వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని దాటవేశారు. అనంతరం నోడల్​ ఆఫీసర్​ వద్దకు వెళ్లగా తమ చేతుల్లో సమాధానం ఇవ్వడంతో కంగుతిన్నారు. తన కుమారుడి పరీక్ష రాయకపోతే ఏడాది వృథా అవుతుందని సాయిలు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.