అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా 14 మంది మద్యం తాగి వాహనాలు నడిపినట్లు గుర్తించారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Second Class Magistrate) ఎదుట హాజరుపరిచారు. పట్టుబడిన వారిలో ముగ్గురికి జైలుశిక్ష విధించారని.. 11 మందికి జరిమానా వేశారని ఏసీపీ వివరించారు.