అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం హుమ్నాపూర్ నుంచి ఆఫందిఫారం వరకు సీఆర్ఆర్ గ్రాంట్ (CRR Grant) రూ.50 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డుకు బుధవారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (DCCB Former Chairman Pocharam Bhaskar Reddy), వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.
