ePaper
More
    Homeభక్తిSaraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Saraswathi Pushkaralu | సరస్వతి పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saraswathi Pushkaralu | త్రివేణి సంగమమైన కాళేశ్వరం kaleshwaram వద్ద సరస్వతి నది పుష్కరాలు Saraswathi Pushkaralu ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న పుష్కరాలకు భక్తులు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం నదిలో దాదాపు 50 వేల మంది పుణ్య స్నానాలు చేసి, కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి mukteswara swamyని దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

    Saraswathi Pushkaralu | పెరగనున్న భక్తుల రద్దీ

    కాళేశ్వరం వద్ద గోదావరి godavari, ప్రాణహిత pranahitha, సరస్వతి saraswathi నదులు ఒకచోట కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది. అంతర్వాహిని అయిన సరస్వతి నదికి గత వందేళ్లుగా కాళేశ్వరం వద్ద పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో నేటి (బుధవారం) నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...