ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

    Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mla Pocharam Srinivas Reddy | ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతలు ఆగమవుతున్నారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనేవారు లేక నిరసనలకు దిగుతున్నారు. బుధవారం పోతంగల్‌ మండలంలో pothangal mandal రైతులు farmers ఆందోళనకు దిగారు. స్థానిక చెక్‌ పోస్ట్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంటలు పూర్తయిన ధాన్యం సంచులను వెంటనే మిల్లులకు తరలించాలని, లోకల్‌ రైస్‌ మిల్లులకే local rice mill అలాట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో మండలానికి వచ్చిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రైతుల Mla Pocharam Srinivas Reddy వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడి.. బుధవారం సాయంత్రంలోగా సమస్యలన్ని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....