Terror Attack | టపాసులు, చీర్​లీడర్లు లేకుండానే ఐపీఎల్​ మ్యాచ్​
Terror Attack | టపాసులు, చీర్​లీడర్లు లేకుండానే ఐపీఎల్​ మ్యాచ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terror Attack |కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్​(IPL)లో బుధవారం జరిగే మ్యాచ్​లో నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఉప్పల్​ వేదికగా సన్​ రైజర్స్​ హైదరాబాద్​(Sunrisers Hyderabad), ముంబయి ఇండియన్స్(Mumbai Indians)​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఉగ్రదాడి నేపథ్యంలో స్టేడియంలో ప్లేయర్లు మౌనం పాటించనున్నారు.

మృతులకు సంతాపంగా ఈ రోజు మ్యాచ్​లో టపాసులు పేల్చకూడదని, చీర్​ లీడర్ల ప్రదర్శన ఉంచొద్దని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతి మ్యాచ్​లో ఫోర్లు, సిక్స్​లు కొట్టినప్పుడు.. వికెట్లు పడినప్పుడు టపాసులు పేల్చడంతో పాటు, చీర్​ లీడర్లు డ్యాన్స్​ చేస్తారు. అయితే ఉగ్రదాడిలో మృతులకు సంతాపంగా ఈ రోజు వాటిని తీసివేస్తున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు(IPL Organizers) ప్రకటించారు.