ePaper
More
    HomeజాతీయంTerror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Terror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Terror Attack |కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్​రావు​పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారో తెలుస్తుంది. కాగా మధుసూదన్​రావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్​(Kashmir) అందాలను చూడటానికి వెళ్లి ఉగ్రదాడిలో మృతి చెందాడు.

    పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కేబినెట్(Central Cabinet)​ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు మంత్రులు(Ministers) ఢిల్లీకి బయలు దేరారు. ఇప్పటికే ప్రధాని మోదీ(Prime Minister Modi) తన సౌదీ అరేబియా పర్యటను అర్ధంతరంగా ముగించుకొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ ఎయిర్​పోర్టులోనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​తో సమావేశం అయ్యారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. అయితే కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    More like this

    TVS NTORQ 150 లాంచింగ్​.. ఫస్ట్​ హైపర్ స్పోర్ట్ స్కూటర్.. ప్రత్యేకతలు ఇవే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత్​లో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్ (hyper sport scooter) TVS NTORQ...

    BJP Yellareddy | నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గించడం భేష్​.. బీజేపీ నాయకులు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BJP Yellareddy | కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ...

    GPO | కొత్త జీపీఓలకు కౌన్సెలింగ్

    అక్షరటుడే, ఇందూరు: GPO | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామపంచాయతీ అధికారుల (Gram Panchayat Officers) నియామకాలు చేపట్టింది....