PM Modi | పహల్​గామ్​ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం
PM Modi | పహల్​గామ్​ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మోదీ తిరుగు ప్రయాణం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | జమ్మూకశ్మీర్‌లో టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) తన సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారత్​కు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ pak border గగనతలం మీదుగా ప్రయాణించలేదు. మరో మార్గంలో భారత్​కు saudi to india చేరుకున్నారు. ఈ విషయం ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌లోని దృశ్యాల ఆధారంగా తెలిసింది.

PM Modi | అరేబియా సముద్రం మీదుగా..

ప్రధాని మోదీ సౌదీకి ప్రయాణించిన విమానం పాకిస్థాన్‌ (Pakistan) గగనతలం మీదుగా రియాద్‌ చేరుకుంది. అయితే.. ఉగ్రదాడి జరగడంతో ఆయన వెంటనే భారత్​కు బయలుదేరారు. కాగా.. ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణంలో ప్రత్యామ్నాయ మార్గంలో వచ్చారు. ప్రధాని ప్రయాణించిన ఫ్లయిట్​ అరేబియా సముద్రం మీదుగా గుజరాత్‌ గగనతలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి దిల్లీకి చేరుకుంది. పాక్​ నుంచి pak terrorist attack ముప్పు ఉండొచ్చన్న అనుమానంతో మార్గాన్ని మార్చినట్లు తెలుస్తోంది.