అక్షరటుడే, వెబ్డెస్క్ : Gulzar House | హైదరాబాద్ hyderabad లోని పాతబస్తీలో గల గుల్జార్ హౌస్ gulzar houseలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై fire accident ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీర్చౌక్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి cm revanth reddy విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తాజాగా ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం కమిటీని నియమించింది.
Gulzar House | ఆరుగురు ఉన్నతాధికారులతో..
పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి నివేదిక అందించాలని సూచించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ minister ponnam prabhakar తెలిపారు. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ విచారణ అనంతరం సీఎం రేవంత్రెడ్డికి నివేదిక అందించనుంది.
Gulzar House | పునరావృతం కాకుండా..
భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ రిపోర్ట్ సమర్పిస్తుందన్నారు. కాగా.. గుల్జార్ హౌస్ ప్రమాదంలో చనిపోయిన వారిలో రాజేంద్రకుమార్(67) Rajendra kumar , అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్ ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు.